విమానాశ్రయ ఏర్పాటులో కీలక అడుగు.. ఎకరం భూమి రూ.95 లక్షలు..

1 year ago 24
వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు భూసేకరణ కొలిక్కి వస్తోంది. రైతులు భూములు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయగా.. ఎకరాకు రూ. 95 లక్షల వరకు పరిహారం చెల్లించే అవకాశం ఉంది. ప్రభుత్వం రూ. 205 కోట్లు విడుదల చేయగా.. కేంద్రం రూ. 450 కోట్లు కేటాయించింది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం హనుమకొండకు రానున్నారు. ఈ సందర్భంగా మామునూరు భూసేకరణపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అధికారులు సిద్ధం చేసిన సమగ్ర నివేదికను మంత్రులు పరిశీలించి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేయనున్నారు.
Read Entire Article