పెళ్లయి 22 ఏళ్లు అవుతోంది. వారికి ముగ్గురు పిల్లలు కూడా. కానీ ఆ భార్య మాత్రం మూడేళ్లుగా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అక్కడితో ఆగకుండా తమ్ముడు, ప్రియుడితో కలిసి దారుణంగా భర్తను చంపించింది. కారు రెంట్కు తీసుకుని.. యాక్సిడెంట్ చేపించి అంతమెుందించింది. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్లాన్ చేసింది. కానీ చివరికి పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతోంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.