వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. రెండేళ్ల కూతురి హత్య

6 months ago 9
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. తన రెండేళ్ల కన్నకూతురిని ప్రియుడితో కలసి దారుణంగా హత్య చేసి.. పూడ్చిపెట్టి పారిపోయిన అమానవీయ ఘటన మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. శివ్వంపేట మండలం శభాష్‌పల్లి గ్రామానికి చెందిన మమత.. సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం వడ్డేపల్లికి చెందిన బంటు భాస్కర్‌‌‌ను పెళ్లిచేసుకుంది. వీరికి మూడేళ్ల శరణ్‌, రెండేళ్ల తనుశ్రీ సంతానం. గతంలో మమత అత్తింట్లో గొడవపడి పుట్టింటికి వచ్చి వారం రోజులపాటు ఉంది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన పాతనేరస్థుడు ఫయాజ్‌తో చనువుగా ఉంటూ కుమార్తెతో సహా కనిపించకుండా పోయింది. ఈ మేరకు ఆమె తండ్రి కోట్ల రాజు.. మే 27న శివ్వంపేట పోలీసులకు కంప్లెయింట్ చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మమత, ఫయాజ్‌లు ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని శివ్వంపేట తరలించారు. పాప తనుశ్రీ ఏదని ప్రశ్నించగా.. మమత, ఫయాజ్ నీళ్లు నమలడంతో లోతుగా విచారించారు. నరసరావుపేటలో తమ ఆనందానికి అడ్డుగా ఉందని భావించి తనుశ్రీని చంపేయాలని నిర్ణయించుకున్నారు. జూన్‌ 7న శభాష్‌పల్లికి తీసుకొచ్చి ఛాతీపై కొట్టి.. అంతమొందించాక, ఓ సంచిలో శవాన్ని ఉంచి.. కాల్వలో పూడ్చిపెట్టారు. తర్వాత నరసరావుపేట వెళ్లిపోయారు. ఈ మేరకు మమత, ఫయాజ్‌లపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నరసరావుపేట వెళ్లేటప్పుడు మమత తన కుమార్తె తనుశ్రీని మాత్రమే తీసుకెళ్లడంతో కుమారుడు శరణ్‌ చావు నుంచి తప్పించుకున్నాడని గ్రామస్థులు పేర్కొన్నారు.
Read Entire Article