విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై మరో కీలక అడుగు పడింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చారు. అలాగే వాల్తేరు డివిజన్ పేరును విశాఖ రైల్వే డివిజన్గా మార్చారు. అలాగే కొత్తగా రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసిన కేంద్రం.. ఈ డివిజన్ను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి చేర్చింది. ఈ విషయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.