విశాఖపట్నం సందర్శనకు వచ్చే పర్యాటకులకు వీఎంఆర్డీఏ తీపి కబురు వినిపించింది. పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం తీసుకువచ్చింది. ఇందుకోసం విస్టా పేరుతో ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చారు. వీఎంఆర్డీఏ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టికెటింగ్ యాప్ను వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, జీవీఎంసీ కమిషనర్ తేజ్ భరత్ గురువారం ప్రారంభించారు. ఈ యాప్ అందుబాటులోకి రావటంతో టికెట్ల కోసం ఇకపై క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదని అధికారులు చెప్తున్నారు.