విశాఖపట్నం తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పోలీస్ స్టేషన్లోనే ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టడంతో అనంతలక్ష్మి వార్తల్లో నిలిచారు. ఈ వ్యవహారంలో ఆమెపై కేసు కూడా నమోదైంది. అయితే అనంతలక్ష్మి జరిగిన వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తి ఎదురుగా కనిపించేసరికి ఆవేశంలో కొట్టినట్లు ఆమె అంగీకరించారు. అయితే పోలీసులను బెదిరించాననే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.