విశాఖపట్నంలో జరిగిన దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మధురవాడ ఆర్టీసీ కాలనీలో 9 నెలల నిండు గర్భిణిగా ఉన్న భార్యను ఓ భర్త హత్య చేశాడు. మరో పెళ్లి చేసుకోవాలనే ఆశతో ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లాం ఊపిరి తీశాడు. తెల్లారితే డెలివరీ అనగా.. రాత్రిపూట పక్కనే నిద్రిస్తున్న భార్యను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనూష అనే భార్యను భర్త జ్ఞానేశ్వర్ హత్య చేయగా.. అనూష గర్భంలో నుంచి చనిపోయిన ఆడబిడ్డను పోస్టుమార్టంలో బయటకు తీశారు.