విశాఖపట్నం మధురవాడ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో సుధాకర్ అనే వ్యక్తి ఏసీబీ అధికారిగా ప్రవేశించి హల్ చల్ చేశాడు. త్వరలో రైడ్ జరుగుతుందంటూ సిబ్బందిని బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే అతని తీరుపై అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. నకిలీ అధికారి అని తేలడంతో పీఎం పాలెం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఇలాంటి మోసం చేయటం ఇదే తొలిసారా.. గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది.