విశాఖ మెట్రో రైలు నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. విశాఖ మెట్రోకు త్వరలోనే కేంద్రం నుంచి అనుమతులు రానున్నట్లు తెలిపారు. 3 ఏళ్లలో వైజాగ్ మెట్రోను పూర్తి చేస్తామని తెలిపారు. తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. అదే సమయంలో విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు వెల్లడించారు. అటు.. విజయవాడ మెట్రో నిర్మాణంపైనా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.