విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. వీఎంఆర్డీఏకు చెందిన డెక్ భవనం నుంచి త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఏపీలో ప్రస్తుతం 70,232 కోట్ల రూపాయలు విలువైన 39 రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2025-26లో ఏపీకి రికార్డు స్థాయిలో కేటాయింపులు చేశామన్నారు.