విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులపై అప్ డేట్. మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ టెండర్ల గడువు పొడిగించారు. కాంట్రాక్టు సంస్థల నుంచి వచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. విజయవాడ మెట్రో టెండర్ గడువు అక్టోబర్ 14, విశాఖ మెట్రో టెండర్ గడువు అక్టోబర్ 7 వరకూ పొడిగించినట్లు తెలిపారు.