విశాఖపట్నంలో అనుమానాస్పద వ్యక్తి కలకలం రేపాడు. సిరిపురం జంక్షన్లో ఫోటోలు తీస్తూ కనిపించాడు. దీంతో స్థానికులు కంగారు పడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. భారత్ పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పద వ్యక్తి తీరు కలకలం రేపింది.