విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేది లేదని మరోసారి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ప్లాంట్ ప్రైవేటు పరం అవుతోందని గత కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఖండించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.