విశాఖ-హైదరాబాద్ ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే దాని ఇంజిన్లోకి పక్షి చొచ్చుకెళ్లింది. దీంతో విమానం ఇంజిన్ రెక్కలు దెబ్బతిన్నాయి. అయితే దాన్ని గుర్తించిన పైలట్ చాకచక్యం ప్రదర్శించాడు. ఆ విమానాన్ని తిరిగి విశాఖలో ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 103 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.