Vizag New Semiconductor Manufacturing Industry: ఏపీకి వరుసగా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా విశాఖపట్నానికి మరో భారీ పరిశ్రమ రాబోతోంది. రూ.2,387.81 కోట్ల భారీ పెట్టుబడితో ఏఎస్ఐపీ సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ దగ్గర 30 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో రూ.547.09 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది సంస్థ.