భారతదేశ సముద్ర శాస్త్ర ప్రయాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశాఖపట్నంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం దీనిని ప్రారంభించారు. సాగరమాల, బ్లూ ఎకానమీ లక్ష్యాలకు అనుగుణంగా ఏపీని సన్రైజ్ కోస్టల్ స్టేట్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3.25 ఎకరాల విస్తీర్ణంలో ఎన్ఐవో రీజనల్ ఆఫీస్ నిర్మించారు.