Visakhapatnam Omicron Variant Case: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో గత నెలలో నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ బీఎ.2 వేరియంట్ను గుర్తించారు. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో రోజుకు వెయ్యి పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.