Visakhapatnam IFC GVMC Sewerage Rs 553 Crores: విశాఖపట్నం అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. వరల్డ్ బ్యాంక్ సహాయంతో రూ.553 కోట్లతో మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జీవీఎంసీ, ఐఎఫ్సీ మధ్య ఒప్పందం కుదిరింది. ఐఎఫ్సీ నుంచి డైరెక్ట్గా రుణం పొందిన మొదటి నగరపాలక సంస్థగా జీవీఎంసీ నిలిచింది. మధురవాడలో అత్యాధునిక మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి మొక్కల పెంపకానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తారు.