Visakhapatnam Metro Train Foundation: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు అక్టోబరులో ప్రారంభం కానున్నాయని.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నామని, భోగాపురం విమానాశ్రయానికి రహదారులు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. దసరా నాటికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని, అమృత్ పథకం కింద తాగునీటి పనులు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.