Viskahapatnam TDP Sarvasiddi Ananthalakshmi Police Case: విశాఖపట్నంలో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిపై కేసు నమోదు చేశారు పోలీసులు. విశాఖ పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ది అనంతలక్ష్మిపై గాజువాక పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఆమె నరేంద్రను పోలీసుస్టేషన్లోనే చెప్పుతో కొట్టారని ఆరోపణలు చేయగా.. ఈ విషయంపై సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె స్థానిక సీఐ పార్థసారథిని బెదిరించినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి.