AP Govt New Working Women Hostels In Hostels In Visakhapatnam: ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో వర్కింగ్ ఉమెన్స్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం కొత్తగా మూడు వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ నిర్మించాలని గతంలోనే నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా హాస్టల్స్ నిర్మాణం కోసం నిధుల్ని విడుదల చేసింది. విశాఖపట్నంలో హాస్టల్స్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం రూ.113.52 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.