Visakhapatnam Three Working Women Hostels: విశాఖపట్నంలో మహిళా ఉద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.172 కోట్లతో మూడు అత్యాధునిక వసతి గృహాలను నిర్మించనుంది. ముడసర్లోవ, మధురవాడ, నరవ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఫుడ్ కోర్టులు, వినోద సౌకర్యాలతో పాటు అన్ని వసతులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చుతో సురక్షితమైన వసతిని అందించడమే లక్ష్యంగా ఈ హాస్టల్స్ రానున్నాయి. విశాఖపట్నంలో త్వరలోనే వీటి నిర్మాణం ప్రారంభం కానుంది.