Visakhapatnam Metro Pre Bid Meeting For Consultancy: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ కోసం కన్సల్టెన్సీ ఎంపికకు టెండర్లు ఆహ్వానించింది. మొదటి దశలో మూడు కారిడార్లలో 46.22 కి.మీ మేర 42 స్టేషన్లు నిర్మించాలని యోచిస్తున్నారు. 2026 నాటికి మెట్రో పట్టాలెక్కితే రోజుకు 16 వేల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. సమీకృత స్టేషన్లను పలు ప్రాంతాల్లో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.