మ్యారేజ్ బ్యూరోపేరుతో వృద్ధులను మోసం చేసే ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు మహిళలు ఏడాది క్రితం పెళ్లి సంబంధాలు చూస్తామని నమ్మించి 80 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.1.77 లక్షలు కాజేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో నిందితులు కటారు తాయరమ్మ, కూనపరెడ్డి స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి కీలేడీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అంటున్నారు. ఆ వివరాలు..