ఒంటరి జీవితం గడుపుతున్న వృద్ధుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆలనా పాలనా చూసేందుకు డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో 37 కేంద్రాలు రానున్నాయి. అటల్ వయో అభ్యుదయ యోజన కింద నడిచే ఈ కేంద్రాల్లో వృద్ధులకు ఆహారం, వైద్య సదుపాయాలు, ఆటలు, లైబ్రరీ వంటి సౌకర్యాలుంటాయి. దీనికి ప్రభుత్వం ఏటా రూ.4.61 కోట్లు ఖర్చు చేయనుంది.