సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో కొందరు యువత ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారు. గంజాయి వాడకాన్ని ప్రోత్సహిస్తూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సీనియర్ ఐఏఎస్ సజ్జనార్ తీవ్రంగా స్పందిస్తూ.. ఇలాంటి మానసిక రోగుల నుంచి ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సైతం డిమాండ్ చేస్తున్నారు.