హైదరాబాద్ నగరంలో కిలేడీలు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ఉన్నట్లు నటించి లిఫ్ట్ అడిగి వాహనదారుల నుంచి పర్సులు, ఫోన్లు కొట్టేస్తున్నారు. కొందరు బెదిరింపులకు పాల్పడుతుండగా.. మరికొందరు ఆన్లైన్లో పరిచయాలు పెంచుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్లో ఓ కానిస్టేబుల్ను కూడా ఇలాగే మోసం చేశారు.