తెలంగాణలోని ప్రధాన దేవాలయాల రూపురేఖలు మారనున్నాయి! రాష్ట్ర ప్రభుత్వం బాసర, భద్రాచలం వంటి ఎనిమిది ముఖ్య దేవాలయాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు మెరుగుపరచనున్నారు. రహదారుల విస్తరణ, క్యూలైన్లు, అన్నదాన కేంద్రాలు వంటి అనేక సౌకర్యాలు కల్పించనున్నారు. ఆధ్యాత్మిక శోభతో తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కనుంది!