వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే 14 మొక్కు కోడెలు మృతి చెందాయి. గోశాల సామర్థ్యం తక్కువగా ఉండటం, పంపిణీ నిలిపివేయడం, సరైన ఆహారం, డ్రైనేజీ లేకపోవడమే కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలతో వెటర్నరీ బృందం వైద్య సేవలు అందిస్తోంది. మొక్కు జీవాలను సంరక్షించడంలో ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.