వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం రూపురేఖలు మారిపోనున్నాయి. వందేళ్ల మాస్టర్ ప్లాన్తో ఆలయాన్ని 40 ఎకరాలకు విస్తరించి, ఆధునిక వసతులు కల్పించనున్నారు. మొదటి దశలో రూ. 76 కోట్లతో టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. తిరుమల దేవస్థానం తరహాలో.. నిత్యన్నదానం చేయనున్నారు. వేములవాడను పర్యాటకంగానూ అభివృద్ధి చేయనున్నారు.