వేములవాడలో జోరుగా కూల్చివేతలు.. కారణం ఏంటంటే..

6 hours ago 1
వేములవాడ పట్టణంలో ప్రధాన రహదారి వెడల్పు ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి మూలవాగు వంతెన వరకు ఉన్న మార్గాన్ని 80 అడుగులకు విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో, గుర్తించిన 240 మందికి పైగా నిర్వాసితులలో ఇప్పటికే 60 మందికి భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం చెల్లించారు. రూ.47 కోట్లు కేటాయించబడ్డాయి. రోడ్డు వెడల్పు పనుల తొలిదశలో భాగంగా, స్థానిక పురపాలక సంఘానికి చెందిన మాంసం మార్కెట్ ప్రాంగణాన్ని అధికారులు ఆదివారం జేసీబీలతో కూల్చివేశారు. రాజన్న ఆలయం ముందున్న వాణిజ్య సముదాయాన్ని తొలగించారు.
Read Entire Article