ఎండాకాలంలో తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సర్వదర్శనంలో వెళ్లే భక్తుల ఇక్కట్లు తీర్చేందుకు చర్యలు చేపట్టింది. శ్రీవారి దర్శనం కోసం లైన్లలో, కంపార్ట్మెంట్లలో గంటల తరబడి వేచి చూడకుండా.. వేగంగా, నేరుగా దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. కంపార్ట్మెంట్లలో భక్తులను గంటల పాటు ఎదురుచూడకుండా.. డైరెక్ట్గా శ్రీవారి దర్శనానికి పంపించనుంది.