Ys Jagan Sattenapalli Tour Permission Rejected: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల 18న రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు భారీగా జనం వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. తగిన పత్రాలు సమర్పిస్తే అనుమతిపై పరిశీలిస్తామని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిమిత సంఖ్యలో వస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై వైఎస్సార్సీపీ ఇంకా స్పందించాల్సి ఉంది.