వైఎస్ జగన్‌తో భేటీకి ఏపీకి వెళ్లిన కోమటిరెడ్డి.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే

5 months ago 8
పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కొందరు వ్యక్తులు తన ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు.. సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వదంతులను నమ్మొద్దని హస్తం పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కోమటిరెడ్డి.. చిట్యాల మండలం పెద్దకాపర్తిలో కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజ్ గోపాల్ రెడ్డి.. రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, కొత్త పార్టీ పెడుతున్నానని ఇలా అనేక రూమర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ శ్రేయస్సు దృష్ట్యా, పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పానని.. అలా చెప్తే తప్పేంటని ప్రశ్నించారు. తాను ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తుంటే.. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలవడానికి వెళ్తున్నానని వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.
Read Entire Article