అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఓ వ్యక్తిపై బార్లో దాడి జరిగింది. హిందూపూర్ లక్ష్మీ బార్లో గుర్తు తెలియని వ్యక్తులు మోహన్ అనే వ్యక్తిపై దాడి చేశారు. బీర్ బాటిల్తో అతని తల పగలగొట్టారు. మోహన్ ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ మీద అసభ్యకరమైన రాయడానికి వీలులేని వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పుడు అతనిపై జరిగిన దాడి వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.