హామీల అమలుపై ఏపీలో అధికార. విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ టీడీపీ కూటమి సర్కారు ఇంకా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైసీపీ విమర్శిస్తోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఇదే విషయమై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయంటూ నిలదీశారు. అయితే వైఎస్ జగన్ విమర్శలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఏం చేశామనే దానిపై లిస్ట్ విడుదల చేశారు.