Marri Rajasekhar resign To YSRCP: ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ప్రకటించారు. వైఎస్ జగన్ తనను మోసం చేశారని.. కనీస గౌరవం కూడా ఇవ్వలేదని మర్రి రాజశేఖర్ ఆరోపించారు. ఆత్మగౌరవం కోసమే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు మర్రి రాజశేఖర్ తెలిపారు. మరోవైపు త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు మర్రి రాజశేఖర్ ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామాపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.