విశాఖపట్నం వాసులకు సూపర్ న్యూస్. త్వరలోనే విశాఖ నగర వీధుల్లో డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు తీయనున్నాయి. రెండు డబుల్ డెక్కర్ బస్సుల కోసం జీవీఎంసీ ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులతో మరో డబుల్ డెక్కర్ బస్సును సమకూర్చుకోనున్నారు. వీటిలో కనీసం ఒకదానినైనా జూన్ పదో తేదీ నాటికి అందుబాటులోకి తెచ్చి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని జీవీఎంసీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.