తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా.. కీలక డిమాండ్ను తెరపైకి తీసుకువచ్చారు. మద్యం దుకాణాలకు ఉన్న దేవుళ్ల పేర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో వైన్ షాపులకు దేవుళ్ల పేర్లను పెట్టకుండా కొత్తగా చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు. మద్యం షాపులకు దేవుళ్ల పేర్లను పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.