Peddireddy Mithun Reddy Get Bail: వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఊరట లభించింది. లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన ఆయనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 11 వరకు బెయిల్ ఉండగా, తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ఏసీబీ కోర్టులో రెగ్యులర్ బెయిల్పై విచారణ కొనసాగుతోంది.