Yv Subba Reddy Mother Death: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట విషాదం చోటుచేసుకుంది. వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పిచ్చమ్మ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పార్లమెంట్ సమావేశాల కోసం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. ఆయన ఆదివారమే ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.