Mudragada Daughter Joined Janasena: ఏపీలో జనసేన పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిపోయారు. ఇక ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. తాజాగా వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె ముద్రగడ క్రాంతి జనసేనలో చేరారు. భర్తతో కలిసి ఆమె జనసేన కండువా కప్పుకున్నారు. వీరితో పాటుగా పలువురు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు శనివారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.