వైసీపీ తెచ్చిన మరో కార్యక్రమం రద్దు.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

1 year ago 13
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం రద్దు చేసింది. ఎన్నికలకు ఏడాది ముందు వైఎస్ జగన్ ఈ కార్యక్రమం ప్రారంభించారు. తొలుత పార్టీ కార్యక్రమంగా అమలు చేయగా.. ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారు. తాజాగా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం రద్దు చేస్తూ ఏపీ ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article