వైసీపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్.. తరిమి తరిమి కొట్టండంటూ పిలుపు

6 hours ago 1
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేసే వైసీపీ నేతలకు అసలేం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు చాలా మంచి వారని.. ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రివెంజ్ అనేది లేదు.. ఉంటే వైసీపీ నేతల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీకి ఇంకా నాలుగేళ్లు ఉందన్నారు. వైసీపీ నేతలు మేము వస్తే మేము అంటున్నారు... మిమ్మల్ని ఇప్పుడే తంతే మీకు ఎవరు దిక్కు అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ వాళ్లు ఇలా మాట్లాడుతుంటే.. టీడీపీ వాళ్ళు ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. గాలి వస్తే పోయేలా ఉన్న దేవినేని అవినాష్ కూడా మాట్లాడుతున్నాడంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడే కొట్టండని, ఇంకా నాలుగేళ్లు ఉంది చూసుకుందాం అంటూ టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతేకాక తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శాంతి భద్రతల కోసమే మౌనంగా ఉన్నారని తెలిపారు. ఆయన ఒక్క అవకాశం ఇచ్చి.. 30 రోజులు తమని ఫ్రీగా వదిలేస్తే.. ఒక్కొక్కరి అంతు చూస్తామని జేసీ వార్నింగ్ ఇచ్చారు.
Read Entire Article