వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్.. కారణమిదే

1 year ago 36
మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి చేశారనే ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఉద్దండరాయునిపాలెంలో రాజుపై నందిగం సురేష్, ఆయన సోదరుడు ప్రభు దాసు దాడి చేశారని ఫిర్యాదు అందింది. అయితే, రాజు తన ఇంటికి వచ్చి గొడవ చేశాడని నందిగం సురేష్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందిగం సురేశ్ సోదరుడు, ఇతర అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Entire Article