కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సైతం ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మహిళా సమాజం తరపున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి సంఘీభావం తెలిపారు. మహిళలను కించపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భువనేశ్వరి కోరారు.