Chinna Srinu Son Died: విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ మృతిచెందారు. ప్రణీత్ 2020 మే నెలలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడుతూ... చివరకు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. మజ్జి శ్రీనును మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు.