Nidadavolu Municipality Janasena Party Wins: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ తన తొలి మున్సిపాలిటీని గెలుచుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు మున్సిపాలిటీ ఇప్పుడు జనసేన వశమైంది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మాన నోటీసును కలెక్టర్ తిరస్కరించారు. మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీకి తగిన బలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కందుల దుర్గేష్ చొరవతో జనసేన ఈ విజయం సాధించింది. రాజకీయ వ్యూహాలతో మున్సిపాలిటీలో జనసేన పార్టీ జెండా ఎగురవేసింది.