Sake Sailajanath Join In Ysrcp: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లారు. అయితే సీన్ రివర్స్ అన్నట్లుగా తాజాగా మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత ఒకరు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఆయన ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పార్టీలో చేరుతున్నారు. రెండు నెలలుగా ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది.. చివరికి ఇవాళ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.