సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. తాజాగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని వైఎస్ జగన్ ముందే చెప్పినా.. ఆయన పార్టీలో చేరడం గమనార్హం. రేపల్లె ఇంఛార్జిని గెలిపించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇక వైసీపీలో చేరడంతో తన జన్మ ధన్యమైందని పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అంటూ ఈ సందర్భంగా వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.